సకలపాపహరణం 'శిలా వల్మీక రూప  శ్రీ వెంకటేశ్వర స్వామి' దర్శనం

 

 

 తిరుమలగిరి

         కలియుగ ప్రత్యక్ష దైవం, సర్వాంతర్యామి అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి  జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరిలో వల్మీకోద్భవమూర్తిగా కొండపైన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కొండమీద ఏకశిలతో కూడిన వల్మీకం (పుట్ట) రూపంలో స్వయంభువుగా వెలసిన క్షేత్రం తిరుమలగిరి. ఇది కృష్ణా నదికి ఈశాన్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటుంటారు.  ఈ కొండకు నామాల కొండ అని పేరు.  ఈ వల్మీకం లోపల ఆదిశేషుడు శ్రీ స్వామీ వారికి శయ్యగా ఉంటాడని చెబుతారు. ఇక్కడ విశేషమేమంటే స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి పూట దేవతలు ఇక్కడ స్వామివారిని పూజించుకుంటారట.అందుకు నిదర్శనంగా ఉదయము తలుపులు తీసాక పుట్ట చుట్టూ నీటి చుక్కలు  కనిపిస్తాయట.  చాలా మహిమగల స్వామి అని నమ్ముతారు. తిరుపతి సమీపంలో అలివేలుమంగాపురం ఉన్నట్లు ఇక్కడ కూడా అలివేలుమంగ నివసించిందనడానికి గుర్తుగా  ఈ పర్వతం సమీపంలో మంగొల్లు అనే గ్రామం వుంది. దీని అసలు పేరు మంగప్రోలు... అది క్రమేపి మంగొల్లుగా మారిందని భావిస్తుంటారు.  

ఈ స్వామిని దొరబాబు, నామాల వెంకటేశ్వరస్వామి అనికూడా పిలుచుకుంటారు

           ఇక్కడ శ్రీ స్వామివారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే పూజలందుకుంటారు. ఆలయ తలుపులు మూసిన తరువాత దేవస్థానంలో గాని, కొండ పరిసర ప్రాంతాలలో గాని ఎవ్వరు వుండరు. ఆ సమయంలో ఆదిశేషుడు స్వామి వారిని అర్చిస్తాడని భక్తుల బలమైన నమ్మకం. ఈ కొండమీద స్వామివారిని సేవిస్తూ మహాకాల సర్పం (ఆదిశేషుడు) తిరుగుతుంటాడని స్వయంగా చూసిన వారు చెపుతుంటారు. అందుకే రాత్రి వేళల్లో దేవతలు, ఆదిశేషు స్వామిని సేవిస్తారని కొండ మీదకు ఎవ్వరు వెళ్ళరు. సాహసించి వెళ్ళిన వారికి పాము బుస భయంకొలుపుతూ వినిపించటం వలన పరుగులు పెడుతూ కిందకు దిగిపొయిన సంఘటనలు ఉన్నాయి. 

ఈ క్షేత్రం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. 

          కొండ మీద స్వామీ వారికి తూర్పున స్వామీ వారి ఎడమ పాదాకారంలో వున్నకోనేరు కనిపిస్తుంది. అక్కడే శివాలయం, స్వామీ వారి పాదాలు మనకు కనిపిస్తాయి. కొండ చుట్టూ, మధ్య భాగంలో తొమ్మిది ఆంజనేయ స్వామీ వారి విగ్రహాలు వున్నాయి.  ఈ విగ్రహాలను భరద్వాజ మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ వరాహ స్వామి కూడా వున్నారు.  
స్థల పురాణం :
         భరద్వాజముని తపోఫలంగా మానవులను తరింప చేయడానికి శ్రీనివాసుడు వల్మీక రూపంలో ద్వాదశ నామాలతో స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణ కధనం. ఈ వల్మీకం మీదనే స్వామి వారి ఉభయ దేవేరులు లక్ష్మి, శ్రీదేవి నామాల రూపంలో కొలువై వున్నారు.
          ఈ క్షేత్రం సమీపంలో భరద్వాజ మహర్షి తపస్సు చేసి వరం పొంది, స్వామీ వారికి నిత్యం పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేసేవాడని స్థల పురాణం.  
        శ్రీవేంకటేశ్వరస్వామికి  వల్మీకం(పుట్ట)లో దాహం వేయగా ఈశ్వరుడు గోవుగా,  బ్రహ్మ దూడగా వచ్చి శ్రీ స్వామి వారి దాహం తీర్చినట్లుగా చెబుతారు.
           ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి.  ఈ ఆలయం ఉత్తర భాగంలో వున్న బిల్వ వృక్షానికి మూడు ప్రదక్షిణలు చేసి భార్య చీర చెంగు చింపి ఈ చెట్టుకు కట్టి తన కోరిక తెలుపుకుంటే ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డతో వచ్చి శ్రీ స్వామీ వారిని దర్శించుకుంటారనే విశ్వాసం భక్తులలో వుంది. 
ఉత్సవాలు
               ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి బహుళ చవితి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రామాలు వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ కార్యక్రమం నుండి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, చక్రతీర్థం, పవళింపు సేవ, అశ్వవాహనోత్సవం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ప్రతి నెల పౌర్ణమికి మాస కళ్యాణం, శాంతి కళ్యాణంలు వేదం మంత్రోచ్ఛారణతో జరుగుతుంటాయి. పరిమిత సంఖ్యలో నిత్యాన్నదానం జరుగుతుంది, గదులు వున్నాయి.

                ప్రతి ఉగాదికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. భక్తులు ప్రభలు కట్టుకుని వచ్చి స్వామి వారిని దర్శిస్తారు. రైతులు తమ తమ పాడి గేదెలను  అందంగా అలంకరించుకుని తమ తమ పొలాలలోని తొలి పంటను స్వామీ వారికి సమర్పించి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని రైతుల నమ్మకం.


             ఈ ప్రాంతానికి చేరుకోవడానికి విజయవాడ నుండి జగ్గయపేట వెళ్లే దారిలో చిల్లకల్లు దగ్గర దిగి అక్కడినుండి ప్రైవేట్ ఆటోలు, ఆర్టీసీ బస్సులు వున్నాయి.

 

Tirumalagiri



సకలపాపహరణం 'శిలా వల్మీక రూప  శ్రీ వెంకటేశ్వర స్వామి' దర్శనం

 

 

 తిరుమలగిరి

         కలియుగ ప్రత్యక్ష దైవం, సర్వాంతర్యామి అయిన శ్రీ వెంకటేశ్వరస్వామి  జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరిలో వల్మీకోద్భవమూర్తిగా కొండపైన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కొండమీద ఏకశిలతో కూడిన వల్మీకం (పుట్ట) రూపంలో స్వయంభువుగా వెలసిన క్షేత్రం తిరుమలగిరి. ఇది కృష్ణా నదికి ఈశాన్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటుంటారు.  ఈ కొండకు నామాల కొండ అని పేరు.  ఈ వల్మీకం లోపల ఆదిశేషుడు శ్రీ స్వామీ వారికి శయ్యగా ఉంటాడని చెబుతారు. ఇక్కడ విశేషమేమంటే స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజూ రాత్రి పూట దేవతలు ఇక్కడ స్వామివారిని పూజించుకుంటారట.అందుకు నిదర్శనంగా ఉదయము తలుపులు తీసాక పుట్ట చుట్టూ నీటి చుక్కలు  కనిపిస్తాయట.  చాలా మహిమగల స్వామి అని నమ్ముతారు. తిరుపతి సమీపంలో అలివేలుమంగాపురం ఉన్నట్లు ఇక్కడ కూడా అలివేలుమంగ నివసించిందనడానికి గుర్తుగా  ఈ పర్వతం సమీపంలో మంగొల్లు అనే గ్రామం వుంది. దీని అసలు పేరు మంగప్రోలు... అది క్రమేపి మంగొల్లుగా మారిందని భావిస్తుంటారు.  

ఈ స్వామిని దొరబాబు, నామాల వెంకటేశ్వరస్వామి అనికూడా పిలుచుకుంటారు

           ఇక్కడ శ్రీ స్వామివారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే పూజలందుకుంటారు. ఆలయ తలుపులు మూసిన తరువాత దేవస్థానంలో గాని, కొండ పరిసర ప్రాంతాలలో గాని ఎవ్వరు వుండరు. ఆ సమయంలో ఆదిశేషుడు స్వామి వారిని అర్చిస్తాడని భక్తుల బలమైన నమ్మకం. ఈ కొండమీద స్వామివారిని సేవిస్తూ మహాకాల సర్పం (ఆదిశేషుడు) తిరుగుతుంటాడని స్వయంగా చూసిన వారు చెపుతుంటారు. అందుకే రాత్రి వేళల్లో దేవతలు, ఆదిశేషు స్వామిని సేవిస్తారని కొండ మీదకు ఎవ్వరు వెళ్ళరు. సాహసించి వెళ్ళిన వారికి పాము బుస భయంకొలుపుతూ వినిపించటం వలన పరుగులు పెడుతూ కిందకు దిగిపొయిన సంఘటనలు ఉన్నాయి. 

ఈ క్షేత్రం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. 

          కొండ మీద స్వామీ వారికి తూర్పున స్వామీ వారి ఎడమ పాదాకారంలో వున్నకోనేరు కనిపిస్తుంది. అక్కడే శివాలయం, స్వామీ వారి పాదాలు మనకు కనిపిస్తాయి. కొండ చుట్టూ, మధ్య భాగంలో తొమ్మిది ఆంజనేయ స్వామీ వారి విగ్రహాలు వున్నాయి.  ఈ విగ్రహాలను భరద్వాజ మహర్షి ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ వరాహ స్వామి కూడా వున్నారు.  
స్థల పురాణం :
         భరద్వాజముని తపోఫలంగా మానవులను తరింప చేయడానికి శ్రీనివాసుడు వల్మీక రూపంలో ద్వాదశ నామాలతో స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణ కధనం. ఈ వల్మీకం మీదనే స్వామి వారి ఉభయ దేవేరులు లక్ష్మి, శ్రీదేవి నామాల రూపంలో కొలువై వున్నారు.
          ఈ క్షేత్రం సమీపంలో భరద్వాజ మహర్షి తపస్సు చేసి వరం పొంది, స్వామీ వారికి నిత్యం పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేసేవాడని స్థల పురాణం.  
        శ్రీవేంకటేశ్వరస్వామికి  వల్మీకం(పుట్ట)లో దాహం వేయగా ఈశ్వరుడు గోవుగా,  బ్రహ్మ దూడగా వచ్చి శ్రీ స్వామి వారి దాహం తీర్చినట్లుగా చెబుతారు.
           ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి.  ఈ ఆలయం ఉత్తర భాగంలో వున్న బిల్వ వృక్షానికి మూడు ప్రదక్షిణలు చేసి భార్య చీర చెంగు చింపి ఈ చెట్టుకు కట్టి తన కోరిక తెలుపుకుంటే ఏడాది తిరిగేలోపు పండంటి బిడ్డతో వచ్చి శ్రీ స్వామీ వారిని దర్శించుకుంటారనే విశ్వాసం భక్తులలో వుంది. 
ఉత్సవాలు
               ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ చతుర్దశి నుంచి బహుళ చవితి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రామాలు వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ కార్యక్రమం నుండి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, చక్రతీర్థం, పవళింపు సేవ, అశ్వవాహనోత్సవం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ప్రతి నెల పౌర్ణమికి మాస కళ్యాణం, శాంతి కళ్యాణంలు వేదం మంత్రోచ్ఛారణతో జరుగుతుంటాయి. పరిమిత సంఖ్యలో నిత్యాన్నదానం జరుగుతుంది, గదులు వున్నాయి.

                ప్రతి ఉగాదికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. భక్తులు ప్రభలు కట్టుకుని వచ్చి స్వామి వారిని దర్శిస్తారు. రైతులు తమ తమ పాడి గేదెలను  అందంగా అలంకరించుకుని తమ తమ పొలాలలోని తొలి పంటను స్వామీ వారికి సమర్పించి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని రైతుల నమ్మకం.


             ఈ ప్రాంతానికి చేరుకోవడానికి విజయవాడ నుండి జగ్గయపేట వెళ్లే దారిలో చిల్లకల్లు దగ్గర దిగి అక్కడినుండి ప్రైవేట్ ఆటోలు, ఆర్టీసీ బస్సులు వున్నాయి.

 

No comments:

Post a Comment