శ్రీశైలం దక్షిణ ద్వారం... కడప జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం...లంకమల అభయారణ్యంలో ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం.... నిత్యం దేవతలు అర్చించే స్వామి... శ్రీ నిత్యపూజ స్వామి...
భూఉపరితలానికి 3కి॥మీ॥ ఎత్తులో... ప్రకృతి రమణీయతతో... ఎత్తైన కొండపై నుండి దూకే జలపాతం... కోనేరు... రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు, ఎత్తైన భారీ వృక్షాలు... అప్పుడప్పుడు తొంగిచూసే సూర్యుని కిరణాలు... మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తాయి... అడుగు ఎత్తున్న రాళ్ళ మధ్య ప్రయాణం... ప్రమాదవశాత్తూ కొండపై నుండి రాళ్ళు పడుతున్నప్పుడు శివనామస్మరణతో ఆ రాళ్ళు పక్కకు వైదోలగునని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం ఆర్టీసి సిద్ధవటం నుండి బస్సు నడుపుతుంది. మిగతా రోజులలో ప్రైవేటు వాహనాలలోనే వెళ్ళాలి.
ఋషి అవతారము దాల్చి సాక్షాత్తూ శివపరమాత్ముడే కొండపైన పేటు క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో తపస్సునాచరిస్తూ ఊద్భవలింగంగా మారినట్లు చెబుతారు. శ్రీస్వామి వారిని దేవతలు, ఋషులు ప్రతి నిత్యం పూజించడము వలన నిత్యపూజస్వామిగా ప్రసిద్ధి చెందినట్లు, కొండదిగువున ఉన్న అక్కదేవతలు ఊద్భవలింగాకారంలో వున్న పరమశివుని పూజించేవారని అంటారు. ఈ స్వామికి అభిషేకము చేసి, పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతానము నొసగే స్వామిగా.. శరణు కోరిన వారికి వెన్నంటి నిలుస్తాడని... తప్పు చేసిన వారికి ఇబ్బందులు తప్పవని భక్తుల నమ్మకం.
భక్తులందరు జలపాతంలో స్నానమాచరించి మెట్ల దారి గుండా నిత్యపూజయ్య స్వామి దర్శనానికి బయుదేరతారు... మెట్ల చివరకు ఒక పక్క లోయ... మరో పక్క పెద్ద బండరాళ్ళ క్రింద మనకు నిత్యపూజలన్దుకునే స్వామి కనిపిస్తారు.. దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత మనకు గుహలో ఉద్భవించిన లింగం కనిపిస్తుంది... ఈ గుహలో ప్రవేశం చాలా కష్టదాయకం...
సిద్ధవటం మండం మూలపల్లె గ్రామమునకు చెందిన అయ్యవారయ్య పశువులను మేపుకొంటూ ఉండేవాడు.. పశువుల మందలోని ఒక ఆవు ఉదయం, సాయంత్రం పాలు ఇవ్వకపోవడంతో అయ్యవారయ్య ఆ ఆవును పరిశీలించగా... ఆ ఆవు కొండ సొరంగ మార్గంలోని పేటు క్రింద తపస్సు చేస్తున్న శివపరమాత్ముడి దగ్గరకు వెళ్ళి పాలు ఇవ్వటం గమనించి అయ్యవారయ్య శ్రీ స్వామివారి సేవలోనే ఆరు నెలల కాలం గడుపుతాడు... స్వామి వారి కోరిక మేరకు అయ్యవారయ్య స్వగ్రామమైన మూలపల్లెకు చేరి స్వామి వారి గురించి గ్రామంలో అందరికి వివరించగా... శ్రీ స్వామి వారి ప్రసిద్ధి అందరికి తెలిసినది. అయ్యవారయ్య పెన్నానది ఒడ్డున వున్న తన స్వగ్రామమైన మూలపల్లెలోనే సజీవ సమాధి నొందాడు. నిత్యపూజయ్య స్వామిని దర్శించుకొన్న భక్తులు మూలపల్లెలోని అయ్యవారురెడ్డిని కూడా దర్శించుకుంటారు.
అక్కదేవతల కోన. నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. అక్కదేవతల కోన దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ అక్కదేవతల కోన చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవత లు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.
కొండపైన శ్రీ స్వామి వారి గుడికి దగ్గరగా దాతలు తమ స్వంత ఖర్చుతో ప్రతిరోజు నిర్వహించు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎక్కువగా శ్రీ స్వామి వారిని సోమవారం రోజు మాత్రమే భక్తులు కులమతాలకతీతంగా దర్శించుకుంటారు... కొండపైకి గాని.. అడవిలో గాని ఎటువంటి విద్యుత్‌ సౌకర్యము లేదు.. మహాశివరాత్రి రోజు మాత్రము జనరేటర్లను భుజాలపై మోసుకుపోయి ఆ వారం రోజులు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు శ్రీస్వామి వారి దర్శనానికి ఐదు గంటకు పైగా క్యూలో వేచి వుండాల్సి వస్తుందంటే ఎంతమంది భక్తులు వస్తారో మనం అంచనా వేసుకోవచ్చు. వానాకాలం అయితే నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.
రూట్ మ్యాప్
కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి 16 కిలోమీటర్స్ దూరం దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాలకోన వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.
శ్రీ నిత్యపూజ స్వామి

Nityapoojala Kona

శ్రీశైలం దక్షిణ ద్వారం... కడప జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతం...లంకమల అభయారణ్యంలో ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం.... నిత్యం దేవతలు అర్చించే స్వామి... శ్రీ నిత్యపూజ స్వామి...
భూఉపరితలానికి 3కి॥మీ॥ ఎత్తులో... ప్రకృతి రమణీయతతో... ఎత్తైన కొండపై నుండి దూకే జలపాతం... కోనేరు... రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు, ఎత్తైన భారీ వృక్షాలు... అప్పుడప్పుడు తొంగిచూసే సూర్యుని కిరణాలు... మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తాయి... అడుగు ఎత్తున్న రాళ్ళ మధ్య ప్రయాణం... ప్రమాదవశాత్తూ కొండపై నుండి రాళ్ళు పడుతున్నప్పుడు శివనామస్మరణతో ఆ రాళ్ళు పక్కకు వైదోలగునని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం ఆర్టీసి సిద్ధవటం నుండి బస్సు నడుపుతుంది. మిగతా రోజులలో ప్రైవేటు వాహనాలలోనే వెళ్ళాలి.
ఋషి అవతారము దాల్చి సాక్షాత్తూ శివపరమాత్ముడే కొండపైన పేటు క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో తపస్సునాచరిస్తూ ఊద్భవలింగంగా మారినట్లు చెబుతారు. శ్రీస్వామి వారిని దేవతలు, ఋషులు ప్రతి నిత్యం పూజించడము వలన నిత్యపూజస్వామిగా ప్రసిద్ధి చెందినట్లు, కొండదిగువున ఉన్న అక్కదేవతలు ఊద్భవలింగాకారంలో వున్న పరమశివుని పూజించేవారని అంటారు. ఈ స్వామికి అభిషేకము చేసి, పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతానము నొసగే స్వామిగా.. శరణు కోరిన వారికి వెన్నంటి నిలుస్తాడని... తప్పు చేసిన వారికి ఇబ్బందులు తప్పవని భక్తుల నమ్మకం.
భక్తులందరు జలపాతంలో స్నానమాచరించి మెట్ల దారి గుండా నిత్యపూజయ్య స్వామి దర్శనానికి బయుదేరతారు... మెట్ల చివరకు ఒక పక్క లోయ... మరో పక్క పెద్ద బండరాళ్ళ క్రింద మనకు నిత్యపూజలన్దుకునే స్వామి కనిపిస్తారు.. దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత మనకు గుహలో ఉద్భవించిన లింగం కనిపిస్తుంది... ఈ గుహలో ప్రవేశం చాలా కష్టదాయకం...
సిద్ధవటం మండం మూలపల్లె గ్రామమునకు చెందిన అయ్యవారయ్య పశువులను మేపుకొంటూ ఉండేవాడు.. పశువుల మందలోని ఒక ఆవు ఉదయం, సాయంత్రం పాలు ఇవ్వకపోవడంతో అయ్యవారయ్య ఆ ఆవును పరిశీలించగా... ఆ ఆవు కొండ సొరంగ మార్గంలోని పేటు క్రింద తపస్సు చేస్తున్న శివపరమాత్ముడి దగ్గరకు వెళ్ళి పాలు ఇవ్వటం గమనించి అయ్యవారయ్య శ్రీ స్వామివారి సేవలోనే ఆరు నెలల కాలం గడుపుతాడు... స్వామి వారి కోరిక మేరకు అయ్యవారయ్య స్వగ్రామమైన మూలపల్లెకు చేరి స్వామి వారి గురించి గ్రామంలో అందరికి వివరించగా... శ్రీ స్వామి వారి ప్రసిద్ధి అందరికి తెలిసినది. అయ్యవారయ్య పెన్నానది ఒడ్డున వున్న తన స్వగ్రామమైన మూలపల్లెలోనే సజీవ సమాధి నొందాడు. నిత్యపూజయ్య స్వామిని దర్శించుకొన్న భక్తులు మూలపల్లెలోని అయ్యవారురెడ్డిని కూడా దర్శించుకుంటారు.
అక్కదేవతల కోన. నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. అక్కదేవతల కోన దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ అక్కదేవతల కోన చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవత లు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.
కొండపైన శ్రీ స్వామి వారి గుడికి దగ్గరగా దాతలు తమ స్వంత ఖర్చుతో ప్రతిరోజు నిర్వహించు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎక్కువగా శ్రీ స్వామి వారిని సోమవారం రోజు మాత్రమే భక్తులు కులమతాలకతీతంగా దర్శించుకుంటారు... కొండపైకి గాని.. అడవిలో గాని ఎటువంటి విద్యుత్‌ సౌకర్యము లేదు.. మహాశివరాత్రి రోజు మాత్రము జనరేటర్లను భుజాలపై మోసుకుపోయి ఆ వారం రోజులు విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు శ్రీస్వామి వారి దర్శనానికి ఐదు గంటకు పైగా క్యూలో వేచి వుండాల్సి వస్తుందంటే ఎంతమంది భక్తులు వస్తారో మనం అంచనా వేసుకోవచ్చు. వానాకాలం అయితే నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్లాల్సివస్తుంది.
రూట్ మ్యాప్
కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి 16 కిలోమీటర్స్ దూరం దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాలకోన వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.
శ్రీ నిత్యపూజ స్వామి

No comments:

Post a Comment