శ్రీ చెంచు లక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం, కేతవరం
దిగువ సన్నిధిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారు |
కృష్ణా పరీవాహక ప్రాంతంలో నెలకొన్న నరసింహ క్షేత్రాలు ఐదు. ఇవే పంచ నరసింహ క్షేత్రాలు. ఈ ఆలయాలన్నీ కొండపైనే లేదా గుహలలో నెలకొని ఉంటాయి. వేదాద్రి, మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, కేతవరం. వీటిలో కేతవరాన్ని 'కాటారం', 'కేతారం' అని పిలుస్తారు. కేతవరం గ్రామం గుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలంలో వుంది. ఇక్కడ కృష్ణా నది లోతు ఎక్కువ. ఆలయంలో స్వయంభువుగా శ్రీ నరసింహస్వామి కొలువై వున్నారు. అమ్మవారు చెంచులక్ష్మి.
ఎగువ నృసింహ స్వామి వారి ఆలయం |
ఎగువ ఆలయానికి చేరుకోవడానికి మెట్ల దారి |
ఈ గ్రామంలో మూడు నరసింహ స్వామి ఆలయాలు కలవు. కొండ పైన ఒకటి, దిగువున రెండు నెలకొని ఉంటాయి. ఇవి గ్రామానికి కొంచెం దూరంగా ఉండటం వలన గ్రామంలో నది ఒడ్డునే మరొక నరసింహ స్వామి ఆలయం నిర్మించబడి వుంది. ఈ క్షేత్రం సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగి వుంది.
![]() |
దిగువ సన్నిధి ఆలయం |
స్థల ప్రాశస్త్యం :
ఈ ఆలయాన్ని కోట (కేత) రాజులు నిర్మింప చేసారు. క్రీ.శ.11 వ శతాబ్దంలో కోట కేత రాజుల పాలనలో వున్న ఈ ప్రాంతానికి ఒక యాదవ రాజు సామంతుడుగా ఉండేవాడు. అతను ఈ ప్రాంతంలో నిద్రిస్తుండగా స్వామి వారు కలలో సాక్షాత్కరించి తన ఉనికిని తెలుపగా... ఆ యాదవ రాజు కోట కేతవరాజైన కేతవర్మకు ఈ విషయం తెలిపాడు. కేతవర్మ స్వయంగా విచ్చేసి వెదికించగా కొండమీద రాతి పై శ్రీ స్వామి, అమ్మవార్ల రూపం కనిపించగా అక్కడే రాతి స్తంభాలతో ఆలయాన్ని నిర్మింపచేసి, ధూప దీప నైవేధ్యాల కోసం భూములను ఇచ్చినట్లుగా అక్కడ వున్న శాసనముల ద్వారా తెలుస్తున్నది. కొండ పైకి 600 మెట్లు ఉండడం, మండప నిర్మాణాలకు అవకాశం లేనందున శ్రీ స్వామివారికి ఉత్సవాలు, జాతరలు జరపడం కష్టంగా మారడంతో దిగువన మరొక ఆలయాన్ని నిర్మింప చేశారు. కొండ మీద ముందుగా శ్రీ స్వామీ వారి ఆలయం, దీనికి పైన అమ్మవారి ఆలయాన్ని మనం దర్శించవచ్చు.
వజ్రాలయ్య
శ్రీ స్వామీ వారి ఆలయం నిర్మించిన తరువాత నీటి వసతి కోసం కోనేరు త్రవ్వుచుండగా పనివానికి రాయి గ్రుచ్చుకుని రక్తం కారుచుండగా ఆ గాయాన్ని నీళ్లతో శుభ్రపర్చగా రాయి మెరుస్తూ ఉండడంతో పరిశీలించగా వజ్రం అని నిర్ధారించుకొని... ఇక్కడ మరిన్ని దొరకవచ్చునని మరికొంత లోతుకు వెదకగా శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులు బయల్పడినవి. వజ్రాలతో బయల్పడిన స్వామి వారిని "వజ్రాలయ్య"గా భక్తులు పిలుచుకుంటారు.
రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు స్వామి వారిని దర్శించుట
నది ఒడ్డునే వున్న మరొకఆలయాన్ని శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కట్టించినట్టు, కేతవరం గ్రామాన్ని శ్రీ
స్వామి వారికి 1792 లో దానం చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. వేంకటాద్రి నాయుడు గారి యేలుబడిలో
వున్న ఈ గ్రామంనందు స్థానిక చెంచు తెగ నాయకుడు అతని మద్దతుదారులతో కలిసి దారి దోపిడీలు చేస్తూ
ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు.రాజా వేంకటాద్రి నాయుడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆజ్ఞను
ధిక్కరించడంతో... రాజా వేంకటాద్రి నాయుడు అతనిని నమ్మకంగా విందుకు ఆహ్వానించి అతని చేతులు నరికిస్తాడు.
స్వామి వారికి 1792 లో దానం చేసినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తున్నది. వేంకటాద్రి నాయుడు గారి యేలుబడిలో
వున్న ఈ గ్రామంనందు స్థానిక చెంచు తెగ నాయకుడు అతని మద్దతుదారులతో కలిసి దారి దోపిడీలు చేస్తూ
ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు.రాజా వేంకటాద్రి నాయుడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆజ్ఞను
ధిక్కరించడంతో... రాజా వేంకటాద్రి నాయుడు అతనిని నమ్మకంగా విందుకు ఆహ్వానించి అతని చేతులు నరికిస్తాడు.
![]() |
కృష్ణ నది ఒడ్డునే నిర్మితమైన ఆలయంలోని శ్రీ చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి వారు |
అతిధిని తన ఇంటికి విందుకు ఆహ్వానించి చేతులు నరకడం మిక్కిలి పాపమని కలత చెందిన రాజా వారు తన
పాపానికి పరిహారం చూపమని ఆస్థాన పండితులను అడుగగా వారు హిందూ దేశంలోని అన్ని పవిత్ర నదులలో
స్నానమాచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పడంతో వేంకటాద్రి నాయుడు దేశాటన చేస్తూ ఉండగా ఒక రోజు శ్రీ నరసింహ
స్వామి వారు కలలో కనిపించి "ఎక్కడైతే కృష్ణానది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుందో అక్కడ నాకొక ఆలయాన్ని నిర్మించ
మని చెప్పడం"తో రాజా వారు కృష్ణ నది ఒడ్డున ప్రయాణం చేస్తూ కేతవరం దగ్గర కృష్ణా ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుండ
డంతో, నదిలో స్నానమాచరించి కొండ ఎగువ, దిగువ సన్నిధిలలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించి,
నది ఒడ్డునే మరొక గుడిని కట్టించి తన పాపాన్ని పోగొట్టుకున్నాడని కధనం. ఈ గుడి నిర్మాణాన్ని 1992లో
పునర్నిర్మాణం చేయడం జరిగింది.
ముఖద్వారం |
ఉత్సవాలు
శ్రీ చెంచులక్ష్మి సమేత నరసింహ స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం దిగువ ఆలయంలో జరుగుతుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున రధోత్సవం జరుగుతుంది. ఇక్కడి రథోత్సవానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో వుంది. ఇక్కడి స్వామివారికి పూర్తిగా కంచుతో చేసిన రధం ఉండేదని... ఒక నాడు రథోత్సవం రోజున ఉత్సవ మూర్తులనుంచి కంచు రధంపై ఊరేగిస్తుండగా రధం భక్తుల చేతుల్లో నుంచి పట్టు సడలి నదిలో కలిసి పోయిందనేది ఇక్కడి భక్తుల కథనం. ఇప్పటి వరకు ఆ రధం ఉత్సవ విగ్రహాలతో సహా నదిలోనే ఉండిపోయింది అని అంటారు. అనంతరం స్వామి వారి భక్తుడు శ్రీ పింగళ రామిరెడ్డి శ్రీ స్వామివారికి మరొక రధాన్ని చేయించడంతో అప్పటి నుంచి ఈ రోజు వరకు అదే రథంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతం పులిచింతల ముంపు ప్రాంతం కావడంతో దిగువ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సమీపంలోని కొండ మీదకు తరలించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ఆటోలు ఉంటాయి. ఇది జన సంచారం అంతగా లేని ప్రాంతం కావడంతో గుంపుగా వెళ్లడం మంచిది.
No comments:
Post a Comment